న్యూఢిల్లీ : రాజ్యాంగ పరిరక్షణకు ప్రతిన వహిస్తున్నానని ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ చెప్పారు రాజ్యాంగంపై ఎటువంటి దాడిని అయినా తాము అనుమతించేది లేదని, ప్రతిఘటిస్తామని చెప్పారు. రాజ్యాంగంపై పడే దెబ్బకు అడ్డుగా తాను నిలబడి తీరుతానని ప్రకటించారు. రాజ్యాంగ పరిరక్షణ తన విద్యుక్త ధర్మం అన్నారు. బుధవారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాహుల్ మాట్లాడారు. రాజ్యాంగం ఓ పుస్తకమే అనుకోరాదు.
ప్రతి పౌరుడికి భరోసా కల్పించే పవిత్ర వాగ్దానం, హక్కుల పరిరక్షణ, సమానత కల్పన, న్యాయం, సమాదరణ అనేవి కుల మత వర్గాలకు అతీంగా ప్రాంతాలు, భాషలతో నిమిత్తం లేకుండా, పేద ధనిక తారతమ్యాలు లేకుండా వర్తింపచేసేందుకు రాజ్యాంగం ఉపకరిస్తోందని తెలిపారు. రాజ్యాంగం పౌరుల అదికారాన్ని, హక్కులను నిలబెడుతుంది. సామాన్యుడి గొంతుకకు వెన్నుదన్నుగా నిలుస్తుందని చెప్పారు. రాజ్యాంగం భద్రంగా ఉన్నంత కాలం, ప్రతి పౌరుడు సురక్షితంగా ఉంటారని స్పష్టం చేశారు.