గౌహతి: బర్సాపారా క్రికెట్ స్టేడియంలో భారత్-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ మూడో రోజు టీమిండియా 38 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 106 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. యశస్వి జైస్వాల్ ఒక్కడే హాఫ్ సెంచరీతో మెరిశాడు. మిగిలిన బ్యాట్స్మెన్లు నిరాశపరిచారు. భారత బ్యాట్స్మెన్లు యశస్వి జైస్వాల్(58), కెఎల్ రాహుల్(22), సాయి సుదర్శన్(15), ధృవ్ జురెల్(0), రిషబ్ పంత్(07) పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో రవీంద్ర జడేజా(2), నితీశ్ కుమార్(0) పరుగులలో బ్యాటింగ్ చేస్తున్నారు. భారత జట్టు ఇప్పటివరకు 383 పరుగుల వెనుకంజలో ఉన్నారు. సౌతాఫ్రికాలో బౌలర్లలో మార్కో జాన్సన్, సిమన్ హర్మర్ చెరో రెండు వికెట్లు తీయగా కేశవ మహారాజ్ ఒక వికెట్ తీశాడు.
సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 489