జోహెన్నెస్స్బర్గ్: విస్తరిస్తున్న కృత్రిమ మేధ (ఎఐ ) దుర్వినియోగం అరికట్టేందుకు ప్రపంచ కట్టుబాట్ల కూటమి ఏర్పాటు అవసరం అని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు నిచ్చారు. జి 20 సమ్మిట్ లో ఆయన మూడో సెషన్లో ఆదివారం టి, వి నూత్న పరిణామాల విషయంపై విశ్లేషణాత్మక ప్రసంగం చేశారు. అత్యంత కీలకమైన సాంకేతిక తు మానవ కేంద్రీకృతం కావాల్సిందే. కేవలం ఆ ర్థిక లావాదేవీలతోనే సాగరాదని పిలుపు నిచ్చా రు. ఈ సందర్భంగా ఆయన ఎఐ ఇతర ఐటి వైపరీత్య లక్షణాల ఆటకట్టుకు అత్యవసరంగా గ్లోబ ల్ కూటమి అవసరం అని కోరారు. టెక్నాలజీ విధానాలు కేవలం జాతీయం దేశాల పరిమితం కాకుండా అవి గ్లోబల్ కావల్సి ఉంటుందన్నారు. వినూత్న ఆవిష్కరణలు కేవలం పరిమితం, కొం దరికే సొంతం కాకుండా అవి బహిరంగ టెక్ వ నరుగా మారాల్సి ఉందని కోరారు. ఇప్పటికే త మ దేశం ఈ విస్తృత విధానంతోనే ముందుకు సాగుతోందని వివరించారు. ఇండియన్ టెక్నాల జీ పర్యావరణ వ్యవస్థ దీనిని అనుసంధానం చే సుకుని ఉందని, ఈ క్రమంలో ప్రజలకు బహుళ ప్రయోజనాలు దక్కుతున్నాయని తెలిపారు.
అం తరిక్ష రంగం మొదలుకుని ఎఐ వరకూ డిజిటల్ చెల్లింపుల దాకా ఇదే పంథా ఉందన్నారు. డిజిట ల్ పేమెంట్స్లో భారత్ గ్లోబల్ స్థాయిలో అగ్రదశలో ఉందని తెలిపారు. ప్రధానమైన ఖనిజాలు, పనివిధానాలు, ఎఐ ఇతర విషయాలలో అందర కి సరైన న్యాయం, భవిత అనే ఇతివృత్తంతో ఈ సెషన్ జరిగింది. ఎఐ రాకను కాదనలేమం అయి తే ఇది మానవాళికి ఉపయుక్తం అంతకు మించి మేలు చేసేదిగా ఉండాల్సిందే. , దుర్వినియోగం అరికట్టాల్సిందే. ఇందుకు అంతా ఏకాభిప్రాయంతో కట్టడికి తగు వ్యవస్థను ఏర్పాటు చేసుకోవల్సి ఉందని తెలిపారు. ఎఐను కొన్ని నిర్థిష్ట మౌ లిక సూత్రాల పరిధిలోనే వాడుకోవల్సి ఉంటుం ది. సమర్థవంతమైన మానవ పర్యవేక్షణ, డిజైన్పరంగా సెఫ్టీ, పారదర్శకత, డీప్ ఫేక్, క్రైమ్, ఉగ్రవాద చర్యలలో దీని వాడకం లేకుండా చూడటం వంటివి అత్యవసరం అని పిలుపు నిచ్చారు. అన్నింటికీ మించి ఎఐతో మానవ సమర్థత , ఫలితం పెరగాల్సిందే. మానవ శక్తి ఇనుమడించాల్సిందే అయితే ఎఐని ఏ విధంగా ఏ స్థాయిలో వాడుకోవల్సిందనే తుది నిర్ణయాధికారం మానవుడిదే అయి ఉండాలి. అది కూడా సమగ్ర గ్లోబల్ కట్టుబాట్ల పరిధిలో ఉండాలని స్పష్టం చేశారు. ఇది ఎఐ కాలం ,ఈ క్రమంలో మన దృక్పథంలో మార్పు అవసరం, ఇప్పటి ఉద్యోగాల అవసరం అనే ఆలోచన క్రమేపీ రేపటి సమర్థవంతమైన అవకాశాల దిశకు మారాల్సి ఉంటుందని. ఉద్యోగ నిర్వహణ నుంచి ఉద్యోగ ఉపాధి సృష్టి దశకు దారితీయాల్సిందే అన్నారు.
భద్రతా మండలి సంస్కరణలు అత్యవసరం
ఐరాస భద్రతా మండలి సంస్కరణలు ఇప్పుడు అత్యవసరం, ఐచ్ఛికం కావని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. మండలిలో ఇప్పటి భౌగోళిక, సామాజిక ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేర్పులు జరగాల్సిందే అన్నారు. దక్షిణిఫ్రికాలో జి 20 సదస్సు నేపథ్యంలోనే జరిగిన ఇండియా బ్రెజిల్ దక్షిణాఫ్రికా (ఐబిఎస్ఎ) దేశాధినేతల సదస్సులో ప్రధాని ప్రసంగించారు. ప్రస్తుత విభజిత, భిన్నాభిప్రాయాల ప్రపంచంలో ఈ వేదిక ప్రత్యామ్నాయ రీతిలో ఐక్యతా, సహకారం, మానవతా సందేశం బలీయంగా విన్పిస్తుందన్నారు. ఈ సదస్సుకు హాజరయిన దక్షిణాఫ్రికా నేత సైరిల్ రమాఫోసా, బ్రెజిల్ అధ్యక్షలు లూలా డా సిల్వాలను ఉద్ధేశించి మాట్లాడుతూ ఐబిఎస్ఎను మరింతగా వ్యవస్థీకృతం చేయాల్సి ఉందని పిలుపు నిచ్చారు. మూడు సభ్య దేశాల మధ్య మరింత సహకారం అవసరం అన్నారు. భద్రతా మండలి విస్తృతి ద్వారా ప్రపంచానికి సరైన సందేశం వెలువరించాల్సిన అత్యవసర పరిస్థితి ఉందని ఈ నేపథ్యంలో ఆయన భారత్కు మండలిలో చోటు గురించి పరోక్షంగా తమ వాదన విన్పించారు. అంతకు ముందు ప్రధాని మోడీ దక్షిణాఫ్రికా నేత సైరిల్తో విడిగా సమావేశం అయ్యారు. భారత్ దక్షిణాఫ్రికా మధ్య స్నేహ బంధాలను పలు కీలక రంగాలలో మరింత పటిష్టం చేసుకోవల్సి ఉందని తెలిపారు. ఇందుకు దక్షిణాఫ్రికా నేత సానుకూలంగా స్పందించారు.
జి 20 బాధ్యత ఈజీ కాదని చెప్పాల్సింది
జి 20 సారధ్యం వహించడం ఇంత కష్టమని ముందే చెప్పి ఉండాల్సిందని ప్రధాని మోడీతో దక్షిణాఫ్రికా నేత సైరిల్ రమాఫోసా చమత్కరించారు. ఇంత ఇబ్బంది అని చెప్పి ఉంటే తాను ముందుగానే బాధ్యతల నుంచి పారిపోయి ఉండేవాడినేమో అని నవ్వుతూ తెలిపారు. ఇరువురు నేతలు జి 20 నేపథ్యంలో ముచ్చటించుకున్నారు. ఈసారి జి 20కి దక్షిణాఫ్రికా తొలిసారి ఆతిధ్యం ఇచ్చింది. 2023లో ఈ బాధ్యత తీసుకున్న అనుభవం భారత్కు ఉంది. ఏది ఏమైనా ఇక్కడ ఈ భేటీ జరిగేందుకు భారత్ నేత మోడీ నుంచి అందిన సహకారం అభినందనీయం అని కూడా ఆఫ్రికా నేత స్పందించారు. ఇప్పటి సదస్సును అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బహిష్కరించారు. భారత్లో సువిశాల సుందర భారత్ మండపంలో జి 20 జరిగింది. దీనితో పోలిస్తే ఇక్కడ ఏర్పాటు అయిన వేదిక అల్పమే అని ఆఫ్రికా నేత అంగీకరించారు. దీనికి మోడీ బదులిస్తూ అల్పమే ఎప్పుడూ ఘనం, సూక్ష్మంలోనే మోక్షం అని బదులిచ్చారు.