రవి, శ్రీయ తివారి హీరో హీరోయిన్లుగా సిస్ ఫిలిమ్స్ బ్యానర్పై సైఫుద్దీన్ మాలిక్ నిర్మాణ దర్శకత్వంలో విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రం ‘విచిత్ర’ పేక్షకుల హృదయాలను హత్తుకునే అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. సెన్సార్ పనులు పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఈ సందర్భంగా ఈ చిత్రం దర్శక నిర్మాత సైఫుద్దీన్ మాలిక్ మాట్లాడుతూ ‘ఈ సినిమాలోని హీరోగా రవి, హీరోయిన్ శ్రేయ తివారి, జ్యోతి అపూర్వ, ‘బేబీ’ శ్రీహర్షిణి యసిక, రవి ప్రకాష్, సూర్య, ఛత్రపతికి శేఖర్, మీనా వాసన్ ముఖ్య పాత్రలుగా నటించారు విచిత్ర’ ఒక ఆత్మీయమైన అమ్మ సెంటిమెంట్ నేపథ్యంతో రూపొందిన సినిమా. ప్రతి కుటుంబం తల్లి ప్రేమ, త్యాగం, బంధం గురించి ఆలోచించేలా చేసే హృదయాన్ని తాకే కథ ఇది. ఈ చిత్రాన్ని కుటుంబంతో కలిసి సంతోషంగా ఎంజాయ్ చేయవచ్చు. అమ్మ ప్రేమను, భావోద్వేగాన్ని, కుటుంబ విలువలను కొత్త దృక్కోణంలో చూపించబోతున్నము. ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హృదయాల్లో చిరస్మరణీయమైన ముద్ర వేస్తుందనే ఆశాభావం ఉంది’ అని తెలిపారు.