రాష్ట్రంలో 36 జిల్లాలకు కొత్తగా డిసిసి అధ్యక్షులను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. డిసిసి అధ్యక్ష పదవులను బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కాంగ్రెస్ కేటాయించింది. ఆదిలాబాద్- జిల్లాకు నరేష్ జాదవ్, అసిఫాబాద్ జిల్లాకు- ఆత్రం సుగుణ, భద్రాద్రి కొత్తగూడెంకు తోట దేవీ ప్రసన్న, యాదాద్రి భువనగిరి జిల్లాకు బీర్ల అయిలయ్య, గద్వాల జిల్లాకు ఎం. రాజీవ్ రెడ్డి, హన్మకొండకు వెంకటరాంరెడ్డి, హైదరాబాద్కు ఖలీఫ్ సైదుల్లా, జగిత్యాలకు నందయ్య, జనగాంకు లఖావత్ ధనావతి, భూపాలపల్లికి- కరుణాకర్, కామారెడ్డికి మల్లికార్జున్, కరీంనగర్కు మేడిపల్లి సత్యం, కరీంనగర్ కార్పొరేషన్కు వి.అంజన్ కుమార్, ఖైరతాబాద్కు రోహిత్ ముదిరాజ్, ఖమ్మంకు నూతి సత్యనారాయణ, ఖమ్మం కార్పొరేషన్కు దీపక్ చౌదరి, మహబూబాబాద్కు భూక్య ఉమ, మహబూబ్నగర్కు సంజీవ్ ముదిరాజ్, మంచిర్యాలకు రఘునాథ్ రెడ్డి,
మెదక్కు శివన్నగిరి ఆంజనేయులు గౌడ్, మేడ్చల్ మల్కాజిగిరికి తోటకూర వజ్రేష్ యాదవ్, ములుగుకు పైడాకుల అశోక్, నాగర్ కర్నూల్కు – డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, నల్గొండకు కైలాశ్ నేత, నారాయణ్పేట్కు కొల్లుకుదురు ప్రశాంత్ రెడ్డి, నిర్మల్కు వెడ్మ బొజ్జు, నిజామాబాద్కు నగేశ్ రెడ్డి, నిజామాబాద్ కార్పొరేషన్కు- బొబ్బిలి రామకృష్ణ, పెద్దపల్లికి ఎంఎస్ రాజ్ ఠాకూర్, రాజన్న సిరిసిల్లకు సంగీతం శ్రీనివాస్, సికింద్రాబాద్కు దీపక్ జాన్, సిద్దిపేటకు ఆంక్షా రెడ్డి, సూర్యాపేట్కు గుడిపాటి నర్సయ్య, వికారాబాద్కు ధారాసింగ్ జాదవ్ను, వనపర్తికి శివసేనా రెడ్డి, వరంగల్కు మహ్మద్ అయ్యుబ్లను డిసిసి అధ్యక్షులుగా నియమిస్తూ శనివారం ఆల్ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏఐసిసి నియమించిన అభ్జర్వర్లు, సీనియర్ నాయకులతో చర్చించిన తరువాత కాంగ్రెస్ అధిష్టానం డిసిసి అధ్యక్షుల నియామకానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.