ముంబై: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు డ్రైవర్కి గుండెపోటు రావడంతో కారు అదుపు తప్పి బైక్లపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ బైక్ గాల్లో ఎగిరి కిందపడింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు గాయపడ్డారు. శుక్రవారం సాయంత్రం ఠాణెలోని అంబర్నాథ్ ఫ్లైఓవర్పై ఈ ఘటన చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివసేన పార్టీకి చెందిన స్థానిక ఎన్నికల అభ్యర్థి కిరణ్ చాబే ఎన్నికల ప్రచారం నుంచి తిరిగి వస్తుండగా.. కారు డ్రైవర్ లక్ష్మణ్ షిండేకు గుండెపోటు వచ్చింది. దీంతో కారు నియంత్రణ కోల్పోయి.. ముందున్న బైక్లతో పాటు ఇతర వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి బైక్తో సహా ఎగిరి ఫ్లైఓవర్ కింద పడ్డాడు. ఈ ఘటనలో డ్రైవర్ షిండేతో పాటు మరో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడగా.. స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. కిరణ్ చాబేను కూడా బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.