హైదరాబాద్: పోలీస్ అధికారులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ సిబ్బందితో సహా ప్రభుత్వ అధికారులపై దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సిపి సజ్జనార్ తెలిపారు. గురువారం తన ట్విట్టర్ సిపి సజ్జనార్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు విధులకు ఆటంకం కలిగించిన, బెదిరింపులకు దిగిన, దాడులు చేసిన చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై దాడులు చేస్తే భారత న్యాయ సంహిత (బిఎన్ఎస్)లోని 221, 132, 121(1) సెక్షన్స్ ప్రకారం బాధ్యులపై క్రిమినల్ కేసులను నమోదు చేయడంతో పాటు హిస్టరీ షీట్స్ కూడా తెరుస్తామన్నారు. ఒక్కసారి కేసు నమోదైతే భవిష్యత్ అంధకారమయ్యే ప్రమాదం ఉంటుందని, పాస్ పోర్టు జారీకి, ప్రభుత్వ ఉద్యోగానికి ఇబ్బందులు వస్తాయని, క్షణికావేశంలో ఏ చిన్న తప్పు చేసిన జీవితాంతం కుమిలిపోయేలా చేస్తామని హెచ్చరించారు.