బీఆర్ అంబేడ్కర్ అత్యున్నతమైన రాజ్యాంగం రూపొందించారని సీఎం చంద్రబాబు అన్నారు. చాయ్వాలా దేశానికి ప్రధాని అయ్యారంటే అది మన రాజ్యాంగం వల్లేనని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లయిన పూర్తయిన సందర్భంగా ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో మంగళగిరిలో నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ ఆర్థిక సంస్కరణలు దేశ దిశనే మార్చేశాయన్నారు. 2014లో 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న మనం ఇప్పుడు 4వ ఆర్థిక వ్యవస్థకు చేరామన్నారు. వచ్చే ఏడాది భారత్ ప్రపంచంలో మూడో, 2038 నాటికి రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కాబోతోందని పేర్కొన్నారు. 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్నది లక్ష్యమని అన్నారు. ప్రజాస్వామ్యం గాడి తప్పినప్పుడు న్యాయ వ్యవస్థే దాన్ని గాడిన పెడుతోందని తెలిపారు.
మీడియా రంగంలోనూ ఇటీవల చాలా మార్పులు వచ్చాయని, సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ రైటరే, ప్రతి ఒక్కరూ ఎడిటరే అన్నారు. సామాజిక మాధ్యమాలను వ్యక్తిత్వ హననానికి ఉపయోగించడం దురదృష్టకరమని సీఎం చంద్రబాబు అన్నారు. అద్భుతమైన రాజ్యాంగాన్ని అంబేడ్కర్ మనకు అందించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా మంగళగిరిలో హైకోర్టు న్యాయవాదుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. భారత రాజ్యాంగం అందించే స్ఫూర్తి చాలా గొప్పదన్న ముఖ్యమంత్రి రాబోయే రోజుల్లో భారత్ అన్నిరంగాల్లో నిపుణులను అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2047కల్లా ప్రపంచంలో ప్రభావవంతమైన దేశంగా భారత్ మారుతుందని సీఎం వ్యాఖ్యానించారు.