కోల్కతా: ఈడెన్ గార్డెన్లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ సౌతాఫ్రికా 54 ఓవర్లలో 153 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో సపారీ జట్టు 123 పరుగుల ఆధిక్యంలో ఉంది. టీమిండియా ముందు 124 పరుగుల లక్ష్యాన్ని సఫారీ జట్టు ఉంచింది. స్పిన్ మాయజాలంలో ఇరుక్కొని సఫారీ బ్యాట్స్మెన్లు విలవిలలాడిపోయారు. రవీంద్ర జడేజా స్పిన్ ధాటికి దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్లు చాపచుట్టేశారు. కెప్టెన్ తెంబు బవుమా ఒక్కడే హాఫ్ సెంచరీతో పర్వాలేదనిపించాడు. మిగిలిన బ్యాట్స్మెన్లు ఘోరంగా విఫలమయ్యారు. ఈ ఇన్నింగ్స్లో రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు, కుల్దీప్ యాదవ్, సిరాజ్ చెరో రెండు వికెట్లు, బుమ్రా, అక్షరపటేల్ చెరో ఒక వికెట్ తీశారు.
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 159
టీమిండియా తొలి ఇన్నింగ్స్: 189