ఇవాళ నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ ఆడిటోరియంలో సమాచార పౌర సంబంధాల శాఖ, తెలంగాణ మీడియా అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ పత్రికా దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ సీ.హెచ్ ప్రియాంక పాల్గొంటున్నా రు. ‘మన తెలంగాణ’ దినపత్రిక సంపాదకులు దేవులపల్లి అమర్, పుర ప్రముఖులు, వర్కింగ్ జర్నలిస్టులు హాజరవుతారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పనిచేయడం ప్రారంభించిన రోజునే నేషనల్ ప్రెస్ డేగా జరుపుకుంటారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక ప్రత్యేకమైన సంస్థ. పత్రికా స్వాతంత్య్రాన్ని ఏకైక సంస్థ. 1956లో ప్రెస్ కౌన్సిల్ ఏర్పాటును చేస్తూ జర్నలిజంలో వృత్తిపరమైన నీతిని కాపాడుకోవడానికి ఉత్తమ మార్గంగా పరిగణించారు. దీని ద్వారా చట్టబద్ధమైన అధికారం కలిగిన సంస్థను ఉనికిలోకి తీసుకువచ్చారు. ఉదయం 10-.30 గంటలకు నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ ఆడిటోరియంలో జాతీయ పత్రికా దినోత్సవం నిర్వహిస్తున్నందున వర్కింగ్ జర్నలిస్టులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీడియా అకాడమీ ఓ ప్రకటనలో కోరింది.