ఎపిలో మరో ప్రయివేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి బాప ట్లకు వెళ్తున్న ప్రయివేటు ట్రావెల్స్ బస్సు పల్నాడు జిల్లా రాచుపాలెం మండలంలోని రెడ్డిగూడెం వద్ద అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న సిమెంట్ పైపులపై ఒరిగిపోయింది. ఆ పైపులు అక్కడ జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనుల కోసం ఉంచినవని అధికారులు వెల్లడించారు. అయితే, అదృష్ట వశాత్తూ బస్సులో ఉన్న 30 మంది ప్రయాణికులందరూ అత్యవసర ద్వారం ద్వారా సురక్షితంగా బయటపడ్డారు. ఎటువంటి గాయాలు కాకపోవ డంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల గత కొద్దిరోజులుగా ఎపి, తెలంగాణ రాష్ట్రాల్లో వరుసగా చోటుచేసుకుంటున్న బస్సు ప్రమాదాలు ప్రజల్లో ఆందోళన రేపుతున్నాయి. ప్రైవేట్ బస్సు యజమానులు, ప్రభుత్వ రవాణా సంస్థలు పాటిస్తున్న భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు తలెత్తుతు న్నాయి. రహదారుల దుస్థితి, జాతీయ రహదారులు బాగా దెబ్బతిన్న పరిస్థితి కూడా ఈ ప్రమాదాలకు కారణమని నిపుణులు సూచిసు ్తన్నారు. ప్రయివేటు ట్రావెల్స్ బస్సులే ప్రమాదానికి ఎక్కువగా గురౌతుండటం గమనార్హం.