జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించింది. దీంతో 17 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన ఉపాధ్యాయులు విద్యార్థులను జమ్మికుంట ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. భోజనంలో గుడ్లు వాసన వచ్చాయని.. అన్నంలో పురుగులు ఉన్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.