దర్శకకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో అచ్యుత్ చౌదరి దర్శకత్వంలో దీపా ఆర్ట్స్ శ్రీనివాస గౌడ్ నిర్మాతగా ఎంతో అట్టహాసంగా అతిరథ మహారుధుల సమక్షంలో హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైన చిత్రం ‘ ఇరువురు భామల కౌగిలిలో’. పూజా కార్యక్రమాల అనంతరం దర్శకులు కె.రాఘవేంద్రరావు స్క్రిప్ట్ను నటీనటులు, దర్శక, నిర్మాతలకు అందచేశారు. ‘కమిటీ కుర్రాళ్లు’ ఫేమ్ త్రినాఎద్ వర్మ హీరోగా, వైష్ణవి కొల్లూరు, మలినా హీరోయిన్లుగా అక్షర గౌడ కీలకపాత్రలో నటిస్తోన్న ఈ చిత్రంలో ఎంతోమంది ప్రముఖ నటులు నటించనున్నారు. చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా హీరో హీరోయిన్లపై నిహారికా కొణిదెల క్లాప్నివ్వగా ప్రముఖ దర్శకులు బి.గోపాల్ కెమెరా స్విచాన్ చేశారు. ఫస్ట్షాట్కి ప్రముఖ దర్శకులు ఎ కోదండరామిరెడ్డితో పాటు నిర్మాత, కెమెరామెన్ ఎస్ గోపాల్రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్ర ఓపెనింగ్కి ‘కమిటీ కుర్రాళ్లు’ దర్శకుడు యధు వంశీతో పాటు ఆ సినిమాలో నటించిన నటీనటులందరూ పాల్గొన్నారు. టిల్లు స్క్వేర్ చిత్ర దర్శకుడు మల్లిక్రామ్, దర్శకులు వర ముళ్లపూడి తదితరులు ఓపెనింగ్ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.