అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా పిఠాపురంలోని శ్రీపాద శ్రీవల్లభ సంస్థానంలో భక్తురాలు అత్యుత్సాహం ప్రదర్శించింది. కర్పూర హారతి వెలిగించి హుండీలో వేసింది. దీంతో హుండీలో నోట్లకు మంటలు అంటుకున్నాయి. ఆలయ సిబ్బంది హుండీ నుండి పొగలు రావడాన్ని గమనించి నీళ్ళు పోసి మంటల్ని ఆర్పేశారు. కాలిన నోట్లను వేరు చేసి నోట్లను హెయిర్ డ్రైయర్ తో సిబ్బంది ఆరబెట్టారు. భక్తురాలికి భక్తి ఎక్కువగా ఉండడంతో ఆ పని చేసింది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.