క్రిష్ణగిరి: నాగర్ కర్నూలు జిల్లా క్రిష్ణగిరి మండలో కారులో మంటలు చెలరేగడంతో పూర్తిగా వాహనం దగ్ధమైంది. ఫార్చునర్ కారులో హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తుండగా ఈగలపెంట దగ్గరలో కారులో నుంచి మంటలు వచ్చాయి. కారులో ఉన్నవారి బయటకు దిగి ప్రాణాలు రక్షించుకున్నారు. క్షణాల వ్యవధిలో కారు మొత్తానికి మంటల వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశాయి. పోలీసులు క్రేన్ సహాయం తో వాహనాన్ని పక్కకు తొలగించారు.