ఖమ్మం జిల్లా కుర్రాడికి అబుదాబిలో లాటరీలో రూ.240 కోట్లు గెల్చుకున్నాడు.ఈ లాటీరితో ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన యువకుడు రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయిపోయాడు. చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఉన్నత చదువులు పూర్తి చేసి..ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లిన ఆ యువకునికి అదృష్టం లాటరీ రూపంలో తట్టింది. తన తల్లి పుట్టిన తేదీ 11 కావడంతో అదే సంఖ్యతో లాటరీ టికెట్ కొన్నాడు.ఆ అదృష్ట సంఖ్య అతని జీవితాన్నే మార్చేసింది.ఏకంగా రూ240 కోట్ల రూపాయలు లాటరీ తగిలింది.ఖమ్మం జిల్లా వేంసూరు మండలం భీమవరం గ్రామానికి చెందిన గొల్ల అనిల్ కుమార్ అనే యువకుడు అబుదాబి దేశంలో ఏడాదిన్నరగా సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు.
అయితే అక్కడ తన స్నేహితుల సూచనల మేరకు లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు.తన తల్లి భూలక్ష్మి పుట్టిన తేదీ 11వ తేదీ కావడంతో.. దాన్నే లక్కీ నంబర్గా భావించి లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు.ఆ సంఖ్య అతనికి కలిసొచ్చింది. ఏకంగా అదృష్టం కలిసి వచ్చి రూ 240 కోట్ల లాటరీ తగిలింది.తన కుమారుడికి లాటరీ టికెట్ ద్వారా కోట్ల రూపాయలు వచ్చాయంటే తల్లిదండ్రులు ఇప్పటికి నమ్మలేకపోతున్నారు.ఆ దేవుడే తమకు ఈ మేలు చేశాడని ఆనందపడుతున్నారు.ఏది ఏమైనా అదృష్టం అంటే ఇలా ఉండాలని గ్రామస్తులు చెప్పుకుంటున్నారు. తమ ఊరి వాడికి అబుదాబిలో రూ 240 కోట్లు లాటరీ తగిలిందంటే.. మామూలు అదృష్టం కాదని.. తమకు గర్వంగా ఉందని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.