హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేశారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకొని వస్తుండగా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నైజీరియా నుంచి డెడ్ డ్రాప్ పద్ధతిలో యువకులు డ్రగ్స్ తీసుకొస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. బెంగళూరు నుంచి బస్సులో డ్రగ్స్ తీసుకొని హైదరాబాద్ వస్తుండగా ఎస్ఓటి పోలీసులు వారిని పట్టుకున్నారు. డ్రగ్ సప్లయర్స్ సంగడి సంతోష్ తో పాటు గాంధీ సందీప్ కండేపల్లి శివ, పలక సాయిబాబును పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు నుంచి పెద్ద మొత్తంలో ఎండిఎంఎ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.