హైదరాబాద్: కాంగ్రెస్, బిఆర్ఎస్ మధ్యే అవగాహన ఒప్పందం కుదిరిందని బిజెపి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మాజీ సిఎం కెసిఆర్ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా చేరారని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు యుసఫ్ గూడ డివిజన్ వెంకటగిరిలో కిషన్ రెడ్డి పాతయాత్ర చేశారు. . బిజెపి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తరపున ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోనూ, జూబ్లీహిల్స్ లోనూ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.