హుస్సేన్ సాగర్ లో యువతి మృతదేహం (22) కలకలం రేపింది. లేక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని యువతి మృతదేహం నీటిలో తేలియాడుతుందని ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న లేక్ సిబ్బంది మృతదేహాన్ని బయటకు తీసి, గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాపు చేపట్టారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.