న్యూఢిల్లీ : రష్యాకు చెందిన ఇంధన కంపెనీలపై అమెరికా ఆంక్షలను కఠినతరం చేసిన నేపథ్యంలో భారతీయ రిఫైనరీలు రష్యా నుంచి కొత్తగా చమురు కొనుగోళ్లను నిలిపివేశాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. చె ల్లింపులకు సంబంధించి ఆందోళనలు తలెత్తినందువల్ల ప్రభుత్వం, చమురు సరఫరాదారుల నుంచి స్పష్టమైన వివరణకోసం భారత చమురుశుద్ధి కర్మాగారాలు ఎదురుచూస్తున్నాయి.ఈ అనిశ్చిత పరిస్థితి తొలగేవరకూ రిఫైనరీలు తాత్కాలికంగా కొత్త మార్కెట్లను అన్వేషిస్తున్నాయి.ప్రభుత్వ రంగంలోని ఇం డియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) చము రు కొసం కొత్త టెండర్లు జారీ చేసింది. ప్రై వేటు రంగంలో అతిపెద్దదైన రిలయన్స్ ఇం డస్ట్రీస్ స్పాట్ కొనుగోళ్ల కోసం ప్రయత్నాలు చేస్తోందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. గతవారం రష్యాలోని రెండు అతిపెద్ద చమురు ఉత్పత్తిసంస్థలైన లుకోయిల్, రోస్నెఫ్ట్ లపై అ మెరికా కొత్త ఆంక్షలు విధించింది.ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో యురోపియన్ యూ నియన్, బ్రిటన్ ఇప్పటికే అమలులో ఉన్న ఆంక్షలను పొడగించాయి.
చాలా కార్గోలు ర ద్దయ్యాయి. ఇప్పటికే బ్యాంక్ లు బ్లాక్ లిస్ట్ చేయడంతో లావాదేవీలు నిలిచిపోయాయి. అందువల్ల చెల్లింపులు ఆగిపోయే రిస్క్ ఏ కంపెనీలు చేయబోవని చమురు వ్యవహారాలను చూసే అధికారి ఒకరు వివరించారు. ప్రభుత్వం నుంచి, సరఫరాదారులనుంచి స్ప ష్టమైన వివరణవస్తే తప్ప తాము కొత్త ఆర్డర్లు ఇవ్వలేమని ఓ చమురు శుద్ధి కర్మాగారం ని ర్వాహకుడు చెప్పారు.2022 నుంచి రష్యానుంచి పెద్దగా చమురు కొనుగోలు చేస్తున్న రిలయన్స్ తాము అన్ని ఆంక్షలను పాటిస్తూనే, ఇప్పటికే ఉన్న ఇతర సరఫరాదారుల తో సంప్రదిస్తున్నామని పేర్కొంది. రిలయ న్స్ కూడా రష్యన్ కంపెనీ రోస్నెఫ్ట్ నుంచి చ మురు దిగుమతి నిలిపివేసినట్లు సమాచా రం. 2025 మొదటి 9 నెలల్లో భారతదేశం రోజుకు 2.9 మిలియన్ బ్యారెళ్ళ చొన రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంది. ఇది రష్యా మొత్తం ఎగుమతుల్లో 40 శాతం. ఏప్రిల్ సెప్టెంబర్ మధ్య మనదేశం రష్యానుంచి చేసుకుంటున్న చమురు దిగుమతు లు 8.4 శాతం తగ్గాయి. శుద్ధి కర్మాగారాలు పశ్చిమాసియా, అమెరికా నుంచి కొనుగోళ్లను పెంచుకునేందుకు కృషి చేస్తున్నాయి.