ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ ప్రొడక్షన్ నెం.2గా ‘మా ఇంటి బంగారం’ను సగర్వంగా ప్రారంభించినట్లు ప్రకటించారు మేకర్స్. ఈ ఏడాది బ్యానర్ నుంచి వచ్చిన ‘శుభం’ సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ‘మా ఇంటి బంగారం’ సినిమాలో సమంత, దిగంత్, గుల్షన్ దేవయ్య తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సీనియర్ నటి గౌతమి, మంజుషా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సమంత, రాజ్ నిడుమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మాతలు. ఓ బేబి వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సమంత, నందినీ రెడ్డి కాంబినేషన్లో రూపొందుతోన్న సినిమా ఇది.
ఈ చిత్రానికి ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా… సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు. సీతా మీనన్, వసంత్ మరిన్గంటి కథ, స్క్రీన్ప్లే అందించారు. సన్నిహితులు, శ్రేయోభిలాషుల ఆత్మీయ కలయిక, ఆశీర్వాదాలతో సినిమా ప్రారంభమైంది. మూవీ ఫస్ట్ లుక్ను గమనిస్తే గ్రిప్పింగ్ యాక్షన్ డ్రామాగా అనిపించింది. అద్భుతమైన యాక్షన్ బ్యాంగ్లో ప్రేక్షకుల ముందుకు వస్తామని ఈ సందర్భంగా మేకర్స్ తెలియజేశారు. సినిమా షూటింగ్ ప్రారంభమైందని, మరిన్ని వివరాలను తెలిజేస్తామని మేకర్స్ పేర్కొన్నారు.