30 విభాగాలతో రోగులకు సేవలు
కార్పొరేట్ ఆసుపత్రుల తరహాలో వైద్యం
రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్రాజ్
మన తెలంగాణ/హైదరాబాద్ :సనత్ నగర్ లోని తెలంగాణ వైద్య విజ్ఞాన సంస్థ (టిమ్స్)లో నెల రో జుల్లో సేవలు అందుబాటులోకి వస్తాయని రోడ్లు, భవనాలు, రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యద ర్శి వికాస్ రాజ్ వెల్లడించారు. గురువారం వైద్య ఆ రోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తూ, హై దరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరి చందన, అదన పు కలెక్టర్ జి . ముకుంద రెడ్డి, రహదారులు , భ వనాల శాఖ చీఫ్ ఇంజనీర్లు రాజేశ్వర్ రెడ్డి,లింగారెడ్డి, ఎంఈఐఎల్ ప్రాజెక్ట్ మేనేజర్లు జి ఏ కే స్వామి నాయుడు, వి.శ్రీనివాసరావులతో కలిసి సనత్ నగర్ టిమ్స్ తో పాటు, ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనాల నిర్మాణ ప్రాంతాన్ని, టిమ్స్లో నిర్మాణం పూర్తయిన భవనాలు, వైద్య పరికరాల అమరికలను పరిశీలించారు.
టిమ్స్, ఉస్మానియా ఆసుపత్రులను నిర్మిస్తున్న ఎంఈఐ ఎల్ ప్రా జెక్ట్ విభాగం అధ్యక్షుడు కే గోవర్ధన్ రెడ్డి నిర్మా ణం వివరాలను అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా వికాస్ రాజ్ మాట్లాడుతూ సనత్ నగ ర్ టిమ్స్ ప్రారంభానికి 15 రోజుల్లో సిద్ధం అవుతుందన్నారు. ప్రారంభ తేదీని త్వరలో నిర్ణయిస్తామని అన్నారు. నెల రోజుల్లో ఇక్కడి నుంచి రోగులకు వైద్య సేవలు ప్రారంభం అవుతాయని స్ప ష్టం చేశారు. కార్పొరేట్ ఆసుపత్రుల తరహాలో ఇ క్కడ సేవలు అందించటంతో పాటు నిర్వహణ కూ డా ఉంటుందని చెప్పారు. టిమ్స్ నిర్మాణానికి ఎ లాంటి నిధుల కొరత లేదని, ప్రభుత్వం నెల వా రీ నిధులు విడుదల చేస్తుందని వెల్లడించారు. తెలంగాణాలో నిర్మిస్తున్న టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్య, వైద్యేతర సిబ్బంది నియామకానికి వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకొంటోందని వివరించారు. ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని చెప్పారు.