భారత మేటి జావెలిన్ త్రోయర్ , ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం దక్కింది. భారతీయ ఆర్మీలో గౌరవ ప్రదమైన లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంక్ను ఆయనకు అందజేశారు. ఢిల్లీ లోని సౌత్ బ్లాక్లో ఆయన్ను ఆ ర్యాంక్తో సన్మానించారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ఉపేంద్రద్వివేది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నీరజ్చోప్రా కుటుంబీకులు కూడా ఈ ఈవెంట్ను ప్రత్యక్షంగా వీక్షించింది. పట్టుదలకు, దేశభక్తికి నీరజ్చోప్రా నిదర్శనమని రాజ్నాథ్ అన్నారు. ప్రభుత్వగెజిట్ ప్రకారం నీరజ్ చోప్రా నియామకం ఏప్రిల్ 15 న జరిగింది.
జూనియర్ కమీషన్ ఆఫీసర్గా నయిబ్ సుబేదార్ ర్యాంకుతో నీరజ్ చోప్రా 2016 ఆగస్టులో భారతీయ సైన్యంలో చేరారు. చోప్రాకు గతంలో పద్మశ్రీ,మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న ,అర్జున అవార్డులు దక్కాయి. పరమ విశిష్ట సేవా మెడల్, విశిష్ట సేవా మెడల్ కూడా ఆయన గెలుచుకున్నారు. 2020 లో టోక్యోలో జరిగిన ఒలింపిక్ క్రీడల్లో జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా స్వర్ణ పతకం గెలుచుకుని చరిత్ర సృష్టించారు. ఆ తర్వాత 2024 వరల్డ్ అథ్లటిక్స్లో గోల్డ్ మెడల్ కొట్టారు. ఏషియన్ , కామన్వెల్త్ గేమ్స్తో పాటు డైమండ్ లీగ్ల్లోనూ అతను స్వర్ణ పతకాలు సాధించారు.నీరజ్ చోప్రా తన జావెలిన్ను అత్యుత్తమంగా 90.23 మీటర్లదూరం విసిరి రికార్డు సృష్టించారు.