మహిళల వన్డే ప్రపంచకప్ టోర్నమెంట్లో లీగ్ స్టేజీ ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు సెమీఫైనల్కు అర్హత సాధించాయి. గురువారం న్యూజిలాండ్తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్లో భారత్ గెలిస్తే.. సెమీఫైనల్కు చేరే అవకాశం సులభమవుతుంది. అయితే ప్రపంచకప్ ఫైనల్ గురించి ఏర్పడిన గందరగోళం తొలగిపోయింది. లీగ్ దశలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అయిపోయాయి. దీంతో ఐసిసికి వెసులుబాటు దొరికింది. ఒకవేళ పాకిస్థాన్ ఫైనల్కు చేరుకుంటే.. ఆ మ్యాచ్ను కొలంబోలో నిర్వహించాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు లీగ్ స్టేజీలోనే పాకిస్థాన్ ఎలిమినేట్ కావడంతో ఆ మ్యాచ్ను భారత్లోనే నిర్వహిస్తారు. ఇక తొలి సెమీ ఫైనల్ (అక్టోబర్ 29)కు ఇంకా వేదిక ఖరారు కాలేదు. ఈ మ్యాచ్ ఇండోర్లో జరిగే అవకాశం ఉంది. రెండో సెమీస్ (అక్టోబర్ 30) నవీ ముంబైలో జరుగుతుంది. నవంబర్ 2న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
ఇక ఈ టోర్నమెంట్ని విజయాలతో ప్రారంభించిన భారత్.. ఆ తర్వాత వరుస ఓటములు చవి చూసింది. దీంతో గురువారం న్యూజిలాండ్తో మ్యాచ్ భారత్కు ఎంతో కీలకం. ఎందుకంటే సెమీ ఫైనల్లో బెర్త్ కోసం కివీస్, శ్రీలంక, భారత్ పోటీ పడుతున్నాయి. ఒకవేళ కివీస్తో మ్యాచ్ ఓడిపోతే.. భారత్ సెమీ ఫైనల్కి చేరడం కష్టమవుతుంది. ఒకవేళ గెలిస్తే.. ఎటువంటి ఇబ్బంది లేకుండా సెమీస్కి అర్హత సాధించవచ్చు.