హైదరాబాద్: బిసి బంద్ నేపథ్యంలో దాడులకు పాల్పడ్డ ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. నల్లకుంట, కాచిగూడ పోలీస్ స్టేషన్ లలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బిసి బంద్ సందర్భంగా బిసి జెఎసి నేతలు విద్యానగర్ నుండి బర్కత్పురా వరకు ర్యాలీగా బయలుదేరారు. ర్యాలీగా వెళ్తున్న సమయంలో పలు షాపులు, షోరూంలు, పెట్రోల్ బంక్లు ఓపెన్ చేసి ఉండడంతో వాటిపై ఆందోళనకారులు దాడి చేశారు. 8 మంది బిసి జెఎసి ప్రతినిధులను పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. శనివారం జరిగిన బిసి బంద్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్న విషయం విధితమే. షాపులపై బిసి సంఘం నాయకులు రాళ్లతో దాడి చేశారు. హైదరాబాద్ లోని నల్లకుంట పరిధిలో బిసి బంద్ నేపథ్యంలో బజాజ్ షో రూమ్, రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ పై తెరిచి ఉండడంతో వాటిపై రాళ్లు విసిరి బలవంతంగా బిసి నాయకులు మూయించిన విషయం తెలిసిందే.