మనతెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వ పథకా లు, అభివృద్ధి పనులను అమలు చేయటంలో నిర్లక్ష్యంగా వ్యవహారించ వద్దని ముఖ్యమంత్రి రేవం త్రెడ్డి అన్ని విభాగాల ముఖ్య కార్యదర్శులు, కార్య దర్శులు, విభాగ అధిపతులను హెచ్చరించారు. ప్రభుత్వ కార్యక్రమాల అమల్లో అలసత్వం సహించేది లేదన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినప్పటికీ కొందరు అధికారుల పనితీరులో మార్పు లేదని సిఎం రేవంత్రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అలసత్వం వీడాలని సిఎం సూచించారు. ఎవరికివారు సొంత నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావద్దని, అన్ని విభాగాల సమన్వయంతో ప్రజలకు మేలు జరిగే నిర్ణయాలు, కార్యక్రమాలకు ముందుగా ప్రాధాన్యమివ్వాలని ఆయన అన్నారు. శనివారం ఉదయం సిఎం నివాసంలో సిఎంఓ కా ర్యదర్శులు, సిఎస్ రామకృష్ణారావుతో ముఖ్యమం త్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సంద ర్భంగా సిఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే విషయంలో అధికారులు మరింత చురుగ్గా పని చేయాలని సిఎం రేవంత్రెడ్డి సూచించారు.
సిఎంఓ అధికారులు ప్రతి వారం నివేదికలు అందించాలి
అన్ని విభాగాల కార్యదర్శుల నుంచి ఎప్పటికప్పు డు నివేదికలు తెప్పించుకొని, పనుల పురోగతిని సమీక్షించాలని సిఎస్ను ఆదేశించారు. ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన చర్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని సిఎంఓ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎక్కడ కూడా ఫైలు ఆగిపోవడానికి, పనులు ఆగిపోవడానికి వీల్లేదని ముఖ్యమంత్రి హెచ్చరించారు. కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రావాల్సిన నిధులను రాబట్టుకునే కార్యాచరణను వెంటనే చేపట్టాలని అన్ని శాఖల కార్యదర్శులను సిఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. ఏయే పథకాల్లో రాష్ట్ర వాటా చెల్లిస్తే, కేంద్రం నుం చి నిధులు రావాల్సి ఉందో, వాటికి ముందుగా ప్రాధాన్యమివ్వాలని ఆయన సూచించారు. ఇకపై సిఎస్తో పాటు సిఎంఓ అధికారులు తమ పరిధిలోని విభాగాలపై ప్రతి వారం తనకు నివేదికలు అందించాలని, తానే స్వయంగా వాటిపై సమీక్ష నిర్వహిస్తానని ముఖ్యమంత్రి తెలిపారు.
ఫీల్డ్ విజిట్లు చేయాలని….
ఏసి గదుల్లో కూర్చొని పని చేయకుండా, పైరవీలతో సమయం గడుపుతున్న అధికారులను ఉద్దేశించి సిఎం రేవంత్ ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. గతంలో కూడా అధికారులు ఏసి గదుల నుంచి బయటకు రావడం లేదు. ఫీల్డ్ విజిట్లు చేయాలని పదే పదే చెప్పినా వారు పట్టించుకోవడం లేదు. ఇలా ఉంటే ప్రజలకు సేవ ఎలా చేస్తారంటూ సిఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఇకపై కంఫర్డ్ జోన్లలో ఉండే అధికారులకు కాకుండా, పనితీరు ఆధారంగా పోస్టింగ్లు ఇవ్వాలని సిఎం నిర్ణయించినట్టుగా తెలిసింది.