ఓ డిజిటల్ చానెల్లో యాంకర్ స్వప్న దర్శకుడు రాంగోపాల్వర్మతో చేసిన ఇంటర్వూ ప్రస్తుతం వివాదం రేపు తోంది. ఈ ఇంటర్వూలో ఆర్జీవీ హిందూ దేవుళ్లపైన, ఇండియన్ ఆర్మీపైనా కించపరుస్తూ మాట్లాడారంటూ దానికి ఊతమిచ్చే విధగా యాంకర్ స్వప్న ప్రశ్నలు ఉన్నాయ ని, ఆర్జీవీ సమాధానాలకు మౌనంగా ఉన్నారంటూ రాజమహేంద్రవరంకు చెందిన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్పార్టీ వ్యవ స్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. రాము ఇజం పేరుతో ఈ ఇంటర్వూ చేసి చాలా కాలం కూడా అయ్యింది. దర్శకుడు రామ్గోపాల్వర్మ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారని ఆరోపణ చేస్తోన్నటువంటి
ఫిర్యాది మేడా శ్రీనివాస్ ఇటువంటి మాటలు సమాజం లో మతపరమైన, ప్రాంతీయ విద్వేషాలను పెంచుతాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక ఇంటర్వూ నిర్వహించిన యాంకర్గా స్వప్న మౌనంగా ఉండి, ఆ వ్యాఖ్యలకు పాలుపంచుకున్న పరిస్థితి ఆ ఇంటర్వూలో కనిపించిందని అందుకే ఆమెపై కూడా కేసు పెట్టినట్టు ఆయన వెల్లడించారు. మేడా శ్రీనివాస్ ఫిర్యాదుతో పాటు సోషల్ మీడియా (ఫేస్బుక్, యూట్యూబ్)లో అప్లోడ్ అయిన ఇంటర్వూ వీడియోలు, ఆటోగ్రాఫ్ పోస్టు లను ఆధారాలుగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్గా సమర్పించారు. భారతీయ న్యాయ సంహిత యాక్టు కింద కేసు నెంబర్ 487/2025, సెక్షన్లు 196(1), 197(1), 353, 354, 299 (అభిప్రాయ వ్యక్తీకరణలు, మత విద్వేషాలు, పబ్లిక్ ట్రాన్కిలిటి డిస్టర్బెన్స్కు సంబంధించినవి) కింద నమోదు చేశారు.