తమ సమస్యలు పరిష్కరించాలని సెర్ప్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. రాష్ట్ర ఐకెపి విఓఏల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో విఓఏలకు న్యాయం చేయాలన్న డిమాండ్లతో గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం సచివాలయం ఎందుట ఆందోళనకు దిగారు. విఓఏలను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించి, హెచ్ఆర్ పాలసీని వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. విఓఏ ఉద్యోగ భద్రత, రూ.20 వేల జీతం ఇస్తామని హామీ ఇచ్చారన్న ఆ హామిని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇన్యూరెన్స్, సోషల్ సెక్యూరిటీ సౌకర్యంతో పాటు సిసి పోస్టులకు విఓఏలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీఓ నంబర్ 58ను వెంటనే రద్దు చేయాలన్నారు. డిజిటలైజేషన్ దృష్ట్యా ల్యాప్టాప్, కంప్యూటర్, ఇంటర్నెట్ బిల్లు సదుపాయం కల్పించాలన్నారు.