మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ స ర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన గ్రూప్- 2 అభ్యర్థులకు ఈనెల 18 తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిచే నియామక పత్రాలు అందించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు వెల్లడించారు. 18 తేదీ సాయంత్రం శిల్పకళా వేదికలో నిర్వహించను న్న ఈ కార్యక్రమ ఏర్పాట్లపై సంబంధిత ఉన్నతాధికారులతో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం లో మంగళవారం సిఎస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రూప్-2 ద్వారా ఎంపికైన 783 మంది అభ్యర్థులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నియామక పత్రాలు అందిస్తారని సిఎస్ తెలిపారు.
వారిలో దాదాపు 16 శాఖలకు చెందిన అభ్యర్థులు ఉన్నారని, ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులను ఆహ్వానిస్తున్నట్లు సిఎస్ తెలిపారు. ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను సిఎస్ ఆదేశించారు. ఈ కార్యక్ర మానికి అభ్యర్థితో పాటు వారి కుటుంబ సభ్యులను సాయంత్రం 4 గంటలలోపు శిల్పకళా వేదికలో అనుమతించేలా చర్యలు తీసుకోవాలని సిఎస్ అన్నారు. రెవెన్యూ, హోం, జిఎడి కార్యదర్శులు సమన్వయంతో ఈ నియామకాల్లో అధికంగా, సాధారణ పరిపాలన, రెవిన్యూ, వాణిజ్య పన్నుల శాఖ, ఎక్సైజ్ శాఖ, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన వారే అధికంగా ఉన్నందున రెవెన్యూ, హోం, జిఎడి కార్యదర్శులు ఈ కార్యక్రమ నిర్వహణలో సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని సిఎస్ ఆదేశించారు. నియామక పత్రాలు పొందే అభ్యర్థులు రాబోయే 30 సంవత్సరాల్లో సర్వీస్లో ఉంటారని, వారికి ప్రభుత్వ సర్వీస్ పట్ల ఉన్నత భావన కలిగేలా కార్యక్రమాన్ని నిర్వహించాలని అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను సిఎస్ ఆదేశించారు. ఈ సమావేశంలో డిజిపి శివధర్ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ముఖ్య కార్యదర్శులు బెనహర్ మహేష్ దత్ ఎక్కా, రిజ్వీ, సందీప్ కుమార్ సుల్తానియా, కార్యదర్శులు లోకేష్ కుమార్, టికె శ్రీదేవి, జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి.కర్ణన్, సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ప్రియాంక తదితర అధికారులు పాల్గొన్నారు.