న్యూఢిల్లీ: భారత్ వెస్టిండీస్ మధ్య రుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఫాలో ఆన్తో రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన వెస్టిండీస్ జట్టు భారత్కు గట్టి పోటీ ఇస్తుంది. ఆరంభంలో వేగంగా రెండు వికెట్లు కోల్పోగా.. ఆ తర్వాత క్యాంప్బెల్ (115), హోప్ (103)లు జట్టుకు మంచి స్కోర్ అందించారు. ఇద్దరు సెంచరీలు సాధించారు. కానీ, ఈ ఇద్దరు ఔట్ అయిన తర్వాత కెప్టెన్ చేజ్ (40) మినహా మిగితా వాళ్లెవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. అయితే వెస్టిండీస్ 9 వికెట్లు కోల్పోయి ఏకపక్షంగా మారిన మ్యాచ్ను జెస్టిన్ గ్రీవ్స్, జేడన్ సీల్స్ల జోడీ మలుపు తిప్పింది. చివరి వికెట్కు వీరిద్దరు కలిసి 50 పరుగులు జోడించారు. టీ-బ్రేక్ సమయానికి వెస్టిండీస్ 9 వికెట్ల నష్టానికి 361 పరుగులు చేసి 91 పరుగుల ఆధిక్యంలో ఉంది.