అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోలు జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పిఎస్ కాలేజీ సమీపంలో మినీ బస్సు బోల్తాపడడంతో ఒకరు మృతి చెందగా 16 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఒంగోలు ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతుడు పత్తికొండకు చెందిన జూనియర్ లైన్మెన్ చరణ్ గా గుర్తించారు. విద్యుత్ ఉద్యోగుల ధర్నా చేయడానికి పలమనేరు నుంచి విజయవాడకు బస్సులో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.