అమరావతి: ఓ కుటుంబం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ఆర్ కడప జిల్లా కేంద్రంలో జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడప రైల్వే స్టేషన్ కు కూతవేటు దూరంలో మూడో నంబర్ ట్రాక్ పై గూడ్స్ రైలుకు ఎదురుగా నిల్చొని ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడ్డింది. రైలు ఢీకొట్టడంతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. గూడ్స్ పైలెట్ సమాచారం మేరకు ఆర్ పిఎఫ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.