మన తెలంగాణ/సూర్యాపేట ప్రతినిధి/తుంగతుర్తి : శ్రీరామ్సాగర్ రెండో దశకు మాజీ మం త్రి దివంగత రాంరెడ్డి దామోదర్రెడ్డి పేరు పెడుతున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవం త్ రెడ్డి ప్రకటించారు. ఆదివారం సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన రాంరెడ్డి దామోదర్ రెడ్డి సంతాప సభ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఎం మా ట్లాడుతూ.. తుంగతుర్తి, సూర్యాపేట ప్రాంతాలకు దామోదర్రెడ్డి చేసిన సేవలు ఎప్పటికీ మరవలేనివని కొనియాడారు. పార్టీని, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ దాదా పు నాలుగు దశాబ్దాల పాటు పార్టీ జెండాను ఈ ప్రాంతంలో ఎగురవేసిన నాయకుడు దా మోదర్రెడ్డి అని అన్నారు.
ప్రస్తుత రాజకీయా ల్లో ప్రతి ఒక్కరు ఆస్తులను సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ, రామ్రెడ్డి దా మోదర్ రెడ్డి మాత్రం వారసత్వంగా వచ్చిన ఆస్తులను పేదలకు పంచడమే కాకుండా, తన అత్త గారి కుటుంబ ఆస్తులను కూడా వేలాది ఎకరాలను తుంగతుర్తి ప్రాంత ప్రజలకు దానం చేశారని కొనియాడారు. దామోదర్ రెడ్డికి ఎఐసిసి అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సంతాపం తెలియజేయాల్సిందిగా తెలిపారని, వారి తరపున సర్వోత్తమ్ రెడ్డికి, దామోదర్ రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తున్నానని అన్నారు.
ఫ్లోరైడ్, కరువు ప్రాంతమైన తుంగతుర్తికి శ్రీరామ్సాగర్ జలాలను తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేరును ఎస్ఆర్ఎస్పి ఫేజ్2కు పెడుతున్నట్లు ప్రజల హర్షాధ్వానాల మధ్య ప్రకటించారు. కాగా, సంతాప సభకు డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఎంపిలు, మాజీ హోంమం త్రి జానారెడ్డితోపాటు ఎంఎల్ఎలు, ఎంఎల్సి లు, వివిధ కార్పొరేషన్ ఛైర్మన్లు హాజరై దామన్న చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.