మిరాయ్’ లాంటి పాన్ ఇండియా బ్లాక్బస్టర్ తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ’తెలుసు కదా’. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్స్. ప్రముఖ స్టైలిస్ట్-ఫిల్మ్ మేకర్ నీరజా కోన దర్శకత్వంలో పీపు ల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. తెలుసు కదా అక్టోబర్ 17న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ రాశి ఖన్నా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “-చాలా ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ చూసుంటాం. కానీ ఇందులో ఒక యూనిక్ పాయింట్ వుంది. ఆ పాయింట్ థియేటర్స్లో చూడాలి. అది ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుంది. -ఈ సినిమా షూటింగ్లో చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఈ సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ లవ్, బౌండరీస్ గురించి మాట్లాడుకుంటారు. ఇలాంటి పాయింట్ తో సినిమా ఇప్పటివరకూ నేను చూడలేదు. -ఈ కథని చాలా ఎంజాయ్ చేశాను. నీరజ ప్రతి క్యారెక్టర్ని అద్భుతంగా రాసింది. చాలా లేయర్స్ వున్నాయి.
ఇందులో మూడు పాత్రలు చాలా డిఫరెంట్ గా వుంటాయి. ఆ మూడు పాత్రలు బ్యాలెన్స్ చేయడం చాలా టఫ్. నేను చాలా లవ్ స్టోరీస్ చేశాను. కానీ ఇది చాలా డిఫరెంట్. -ఇందులో అంజలి పాత్రలో కనిపిస్తాను. నా రియల్ లైఫ్ కి ఆ పాత్రకు ఏ మాత్రం పోలికలు లేవు. -హీరో సిద్దు ఆన్సెట్లో క్రాఫ్ట్ మీద చాలా సీరియస్గా వుంటారు. ఆయనకి ప్రతి క్రాఫ్ట్ మీద చాలా గ్రిప్ వుంటుంది. ఆయనతో వర్క్ చేయడం చాలా మంచి అనుభవాన్నిచ్చింది. -తమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మల్లిక గంధ పెద్ద హిట్ అయ్యిం ది. పాటలన్నీ చాలా అద్భుతంగా వచ్చాయి. శ్రీనిధి, -నా కాంబినేషన్ లో చాలా మంచి సీన్స్ వున్నాయి. మేము మంచి ఫ్రెండ్స్ అయ్యాం. –నిర్మాత విశ్వ ప్రసాద్తో వెంకీ మామ సినిమా చేశాను. ఇది సెకండ్ ఫిల్మ్. సినిమా పట్ల చాలా అభిరుచి ఉన్న ప్రొడ్యూసర్. సినిమాకి కావాల్సిన ప్రతిది సమకూర్చారు. -పవన్ కళ్యాణ్తో ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్నాను. పవన్ కళ్యాణ్తో వర్క్ చేయడం గొప్ప అనుభవం. ఇక- హిందీలో నాలుగు ప్రాజెక్ట్ చేస్తున్నాను”అని అన్నారు.