మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ఐకానిక్గా టీ స్వ్కేర్ నిర్మా ణం ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉన్నతాధికారులకు సూచించా రు. నవంబర్ నెల చివరి వరకు వి-హబ్ పనులు ప్రారంభించాలని సిఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ పోలీస్ కమాండ్ సెంటర్లో ఏఐ హబ్, టీ స్వ్కేర్లపై సిఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి శ్రీధర్బాబు, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు జయేశ్రంజన్, సంజయ్కుమార్, సిఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, టిజిఐఐసీ ఎండి శశాంక, టిఫైబర్ ఎండి వేణుప్రసాద్, ఐటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ భవేశ్ మిశ్రా, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.ఈ సందర్భంగా వి-హబ్ ఐకానిక్ బిల్డింగ్గా ఉండాలని సిఎం సూచించారు.
వి హబ్ నిర్మాణం కోసం జైకా ఫండ్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని, దీని నిర్మాణంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సిఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. పార్కింగ్కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, వి హబ్లో ఆపిల్ లాంటి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తమ ఔట్లెట్స్ను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని, యుటిలిటీ జోన్ ఏర్పాటు చేయాలని, వి హబ్ 24 గంటల పాటు పని చేయాలని ఆయన సూచించారు. ఏఐ హబ్ తాత్కాలిక ఏర్పాటు కోసం ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీల్లో భవనాలను పరిశీలించాలని సిఎం ఆదేశించారు. ఏఐ హబ్ కోసం కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలని, దీనికోసం ప్రపంచ ప్రసిద్ధిగాంచిన సంస్థల ప్రతినిధులతో బోర్డు ఏర్పాటు చేయాలని సిఎం రేవంత్ సూచించారు.