మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా విశాఖపట్నం వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా మొదట తడబడినా.. రిచా ఘోష్ అద్భుత పోరాటంతో రేసులో నిలిచింది. దక్షిణాఫ్రికా జట్టుకు లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్.. 100 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. ఈ క్రమంలో తన అద్భుత బ్యాటింగ్ తో జట్టును తిరిగి రేసులో నిలబెట్టింది. చివర్లలో స్నేహ్ రాణా (33)తో కలిసి దక్షిణాఫ్రికా బౌలర్లలపై విరుచుకుపడింది. ఈ క్రమంలో కేవలం 77 బంతుల్లోనే 11 ఫోర్లు, 4 సిక్సులతో 94 పరుగులు చేసింది. చివరి ఓవర్లలో భారీ షాట్ కు యత్నించి క్యాచ్ ఔట్ గా వెనుతిరగడంతో తృటిలో సెంచరీ మిస్ చేసుకుంది. ఆ తర్వాత వెంట వెంటనే భారత్ చివరి రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో 45.5 ఓవర్లలో టీమిండియా 251 పరుగులు చేసింది.