మన తెలంగాణ/హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్ట్పై పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకొని చర్యలు తీసుకోవద్దని కోరుతూ మాజీ సిఎం కెసిఆర్, మాజీ మంత్రి హరీశ్రావు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను హైకోర్టు వచ్చే నెల 12వ తేదీకి వాయిదా వేసింది. ఈ సంద ర్భంగా హైకోర్టు ఇప్పటికే ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తూ ఆ దేశాలు జారీ చేసింది. కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు చేపట్టకూడదని కెసిఆర్, హరీశ్ తమ పిటిషన్లలో వాదించారు. ఆ నివేదికను పూర్తిగా రాజకీయ ఉద్దేశ్యాలతో రూపొందించారని, దాని ఆధారంగా చర్యలు తీసుకోవడం చట్టపరంగా సరైంది కాదని వారు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో హైకోర్టు తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోరాదని స్పష్టంగా ఆదేశించింది. కమిషన్ తరఫున లాయర్ నిరంజన్రెడ్డి ఈ విచారణ సందర్భంగా కౌంటర్ అఫిడవిట్ సమర్పించకపోవడంపై క్షమాపణలు కోరారు. కొన్ని వివరాలు సేకరించడంలో ఆలస్యం జరిగిందని, త్వరలోనే సమగ్రమైన కౌంటర్ సమర్పిస్తామని కోర్టుకు వెల్లడించారు. హైకోర్టు ఆయన వివరణను అంగీకరించి, తదుపరి విచారణ తేదీని నిర్ణయించింది. ఇక ఇదే కేసులో మాజీ ముఖ్య కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి, ఐఎఎస్ అధికారి స్మితా సబర్వాల్ దాఖలు చేసిన పిటిషన్లపై కూడా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. కమిషన్ నివేదికలో తమ పేర్లు ప్రస్తావించబడిన నేపథ్యంలో ప్రభుత్వం తమపై చర్యలు తీసుకోకుండా ఉండాలని వారు కోర్టును ఆశ్రయించారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పిసి ఘోష్ కమిషన్ నివేదికను సిబిఐకి పంపిన విషయం తెలిసిందే. అయితే హైకోర్టు, ఆ నివేదిక ఆధారంగా నేరుగా చర్యలు చేపట్టకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. సిబిఐ తన స్వతంత్ర విచారణను చట్టపరమైన విధానాల ప్రకారం కొనసాగించవచ్చని పేర్కొంది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణ వచ్చే నెల 12న జరగనుంది. అప్పటి వరకు కమిషన్ నివేదిక ఆధారంగా మాజీ సిఎం కెసిఆర్, మాజీ మంత్రి హరీశ్రావు, మాజీ సిఎస్ జోషి, ఐఎఎస్ అధికారి స్మితా సబర్వాల్లపై ఎటు
వంటి చర్యలు తీసుకోరాదని హైకోర్టు స్పష్టం చేసింది.
సిబిఐ ప్రాథమిక విచారణ కొలిక్కి…!
అయితే, కేసులో ఇప్పటికే సిబిఐ ప్రాథమిక విచారణను ప్రారంభించింది. కాళేశ్వరం జస్టిస్ పిసి ఘోష్ కమిషన్, ఎన్డీఎస్ఏ , విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ రిపోర్టులు, కీలక డాక్యుమెంట్లను సేకరించారు. సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ సెప్టెంబర్ 6న హైదరాబాద్లో ప్రత్యేక నిర్వహించి, విచారణ ప్రణాళికను రూపొందించారు. కేసులో ప్రాథమిక పరిశీలన పూర్తి కావస్తున్న నేపథ్యంలో సిబిఐ, కేంద్ర హోంశాఖ అనుమ
తితో ఏ క్షణానైనా బాధ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉంది.