ప్రియదర్శి, నిహారిక ఎన్ఎమ్, విష్ణు, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మిత్ర మండలి’. కొన్నళ్ల క్రితం రిలీజైన ఈ సినిమా టీజర్ ఆకట్టుకోగా.. ఈ మధ్యే రిలీజైన సాంగ్స్కి కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ని విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. ప్రధాన తారగణంతో పాటు వెన్నెల కిషోర్, సత్యల తదితరుల కామెడీ ఈ సినిమాకు హైలైట్గా నిలిచేలా ఉంది. ఇక ఈ సినిమాను నిర్మాత బన్ని వాస్ సమర్పిస్తుండగా.. కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, తీగల విజయేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందించగా.. విజయేందర్ ఎస్ దర్శకత్వం వహించారు. దీపావళి పండుగ కానుకగా ఈ సినిమా అక్టోబర్ 16వ తేదీన విడుదల కానుంది. మీరు కూడా మిత్ర మండలి ట్రైలర్ను చూసేయండి..