హైదరాబాద్: ఫిల్మ్నగర్లో దొంగలు రెచ్చిపోయారు. ఫిల్మ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. ఓ ఇంట్లో 43 తులాల బంగారం, రూ.లక్ష నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఆలస్యంగ వెలుగులోకి వచ్చింది. ఒయు కాలనీలో నివసిస్తున్న స్వప్న ఇంట్లో ఈ దొంగతనం జరిగింది. ఈ మధ్యే ఆమె భర్త చనిపోయారు. సెప్టెంబర్ 27న అత్తవారింటికి వెళ్లి ఈ నెల 5న తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చి చూసేసరికి బంగారం, నగదు చోరీ అయినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.