హైదరాబాద్: సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది. బిసి రిజర్వేషన్లపై వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. హైకోర్టులో పెండింగ్ ఉన్నందున విచారణకు ధర్మాసనం స్వీకరించలేమని తెలిపింది. తెలంగాణ హైకోర్టు స్టే ఇవ్వనందువల్ల సుప్ర్రీం కోర్టుకు పిటిషనర్ వచ్చామన్నారు. హైకోర్టు స్టే ఇవ్వకుంటే సుప్రీంకోర్టుకు వచ్చేస్తారా? అని ప్రశ్నించింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం పిటిషన్ ను కొట్టివేశారు.