హైదరాబాద్: రిజర్వేషన్ల అమలుకు అన్ని పార్టీల ఏకగ్రీవ నిర్ణయంతో గవర్నర్ కు పంపించామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 42 శాతం రిజర్వేషన్ల అమలుకు ఇంటింటి సర్వే నిర్వహించామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టులోవాదనలు జరిగాయని, ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వొచ్చని చెప్పారని, ఈనెల 8న తెలంగాణ హైకోర్టు లో విచారణ ఉందని తెలియజేశారు. న్యాయబద్ధంగా సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తామని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.