న్యూయార్క్: అమెరికాలోని పెన్సిల్వేనియాలో భారత సంతతి వ్యాపారిని చంపేశారు. ఇద్దరు మధ్య జరుగుతున్న వివాదాన్ని ఆపేందుకు వెళ్లిన రాకేశ్(51)ను తుపాకీతో కాల్చి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పిట్స్బర్గ్లోని రాబిన్సన్ టౌన్షిప్లో రాకేశ్ అనే భారత సంతతి వ్యక్తి మోటెల్ నడుపుతున్నాడు. మోటెల్ ఎదరుంగా పార్కింగ్ విషయంలో ఇద్దరు గొడవపడుతున్నారు. రాకేశ్ వారి వద్దకు వెళ్లి సర్దిచెప్పడానికి ప్రయత్నించాడు. నిందితుడు తుపాకీ తీసుకొని పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్పులు జరపడంతో రాకేశ్ ఘటనా స్థలంలోనే చనిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోద చేసి దర్యాప్తు చేస్తున్నారు.