చెన్నై: నటి త్రిష ఇంటికి బాంబు బెదిరింపు వచ్చింది. దాంతో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ నివాసం, గవర్నర్ భవనాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. డాగ్ స్క్వాడ్ సాయంతో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఎలాంటి పేలుడు పదార్థాలు దొరక్కపోవడంతో అది ఫేక్ కాల్ అని పోలీసులు తేల్చారు. ఈ నేపథ్యంలో చెన్నై-ఆళ్వార్పేటలోని సిఎం స్టాలిన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. ఫోన్ నెంబర్ ఆధారంగా బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.