కాన్పూర్: ఆస్ట్రేలియా-ఎ జట్టుతో జరుగుతున్న వన్డే మ్యాచ్లో టీం ఇండియా స్టార్ శ్రేయస్ అయ్యర్ విధ్వంసం సృష్టించాడు. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్యతో కలిసి ఆసీస్ బౌలర్లను ఉతికారేశాడు. ఈ మ్యాచ్లో శ్రేయస్, ప్రియాన్ష్ ఇద్దరు సెంచరీలతో చెలరేగిపోయారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్-ఎ 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 413 పరుగులు చేసింది. భారత బ్యాటింగ్లో శ్రేయస్ 110, ప్రియాన్ష్ 101 పరుగులు చేయగా.. ప్రభ్సిమ్రాన్ సింగ్ (56), రియాన్ పరాగ్ (67), బదోని (60) మెరుపు హాఫ్ సెంచరీలు చేశారు. ఆసీస్ బౌలింగ్లో విల్ సదర్లాండ్ రెండు, సంఘా, ముర్ఫీ, స్కాట్, స్టార్కర్ తలో వికెట్ తీశారు.