ఆసియా కప్- 2025 ఫైనల్ మ్యాచ్లో పాక్పై భారత్ విజయంలో కీలకపాత్ర పోషించిన యువ క్రికెటర్ తిలక్ వర్మ మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తిలక్ వర్మను సత్కరించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్రికెట్ బ్యాట్ను తిలక్ వర్మ బహూకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, శాట్స్ చైర్మన్ శివసేనా రెడ్డి, శాట్స్ ఎండీ సోనిబాల దేవి, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.