శ్రీనగర్: కేంద్ర పాలిత ప్రాంతానికి రాష్ట్ర హోదాను వేగవంతం చేయడానికి బిజెపితో పొత్తు పెట్టుకోవడం కంటే రాజీనామా చేయడమే శ్రేయస్కరం అని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. అనంత్నాగ్ జిల్లాలోని అచాబల్ ప్రాంతంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, రాష్ట్ర హాదా కోసం ఎటువంటి రాజకీయ రాజీకి తాను సిద్ధంగా లేనన్నారు. ‘మీరు(ప్రజలు) సిద్ధంగా ఉంటే, నాకు చెప్పండి. ఎందుకంటే దీనికి నేను సిద్ధంగా లేను. ప్రభుత్వంలో బిజెపిని చేర్చుకోవల్సిన అవసరముంటే నా రాజీనామా అంగీకరించండి. ఇక్కడి ఏ ఎంఎల్ఎనైనా ముఖ్యమంత్రిని చేసి బిజెపితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోండి. నేనైతే దానికి సిద్ధంగా లేను’ అని స్పష్టం చేశారు.