ఎస్ఎస్ దుశ్యంత్, అశికా రంగనాథ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఎపిక్ ఫాంటసీ డ్రామా గత వైభవ. సింపుల్ సుని దర్శకత్వంలో సర్వెగర సిల్వర్ స్క్రీన్స్, సుని సినిమాస్ బ్యానర్స్ పై దీపక్ తిమ్మప్ప, సుని నిర్మిస్తున్నారు. మేకర్స్ తాజాగా ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు. చరిత్ర, పురాణాల నేపధ్యంలో రూపొందిన టీజర్ అద్భుతంగా వుంది. ఎస్ఎస్ దుశ్యంత్, అశికా రంగనాథ్ పర్ఫార్మెన్స్లు ఆకట్టుకున్నాయి. డైరెక్టర్ సింపుల్ సుని కథని విజువల్ వండర్గా చూపించారు. నవంబర్ 14న ఈ చిత్రం విడుదల కానుంది.