ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా ‘థామా’. హారర్ కామెడీగా రూపొందిన ఈ సినిమాకి ఆదిత్యా సర్పోత్దార్ దర్శకత్వం వహించారు. పరేష్ రావల్, నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్రలు పోషించారు. మాడాక్ ఫిలిమ్స్ సమర్పణలో దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించారు. ఈ మూవీ అక్టోబరు 21న విడుదల కానుంది.
ఈ సందర్భంగా మేకర్స్ హైదరాబాద్ లో నిర్వహించిన ప్రెస్ మీట్లో హీరో ఆయుష్మాన్ ఖురానా మాట్లాడుతూ “మాడాక్ ఫిలిమ్స్ హారర్ కామెడీ యూనివర్సిటీలో వస్తున్న సినిమా థామా. బేతాళ్కి హెడ్ థామా. రష్మికతో ఫస్ట్ టైం కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాని తమిళనాడు, ఊటీలో కూడా షూట్ చేశాము. ఇది ఫుల్ పాన్ ఇండియా ఫిలిం”అని అన్నారు.
హీరోయిన్ రష్మిక మందన్న మాట్లాడుతూ.. “మాడాక్ హారర్ కామెడీ ఫిలిమ్స్లో చాలా మంచి కాన్సెప్ట్ ఉంటుంది. కథకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ యూనివర్స్కి ఆడియన్స్ నుంచి చాలా మంచి ఆదరణ ఉంది. ప్రతి సినిమాకి ఒక కొత్త క్యారెక్టర్ చేయాలని ప్రయత్నిస్తుంటాను. ఈ సినిమాతో కూడా ఆడియన్స్ని సర్ప్రైజ్ చేస్తానని భావిస్తున్నాను” అని తెలిపారు.