సిఎం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు
కాంగ్రెస్ గ్యారంటీల మోసాన్ని బాకీ కార్డులతో ఎండగడదాం
700 రోజులు గడుస్తున్నా..ఎక్కడి హామీలు అక్కడే
కాంగ్రెస్కు గుణపాఠం చెప్పే అవకాశం జూబ్లీహిల్స్ ప్రజలకు వచ్చింది: కెటిఆర్
ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ బకాయి కార్డులను అందించిన బిఆర్ఎస్ నేత
మన తెలంగాణ/హైదరాబాద్: ‘ప్రజెంట్ సిటీ’ వరదలతో మునుగుతుంటే, దోమల తో జనం ఇబ్బందులు పడుతుంటే, ‘ఫ్యూచర్ సిటీ’ కడతానని సిఎం రేవంత్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డా రు. తెలంగాణ భవిష్యత్ తరాలే ఫ్యూచర్ సిటీని అద్భుతంగా నిర్మించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉన్న మెట్రో ను రద్దుచేసి జనం లేని ఫ్యూచర్ సిటీకి కొ త్త మెట్రో కడతాననడం రేవంత్ రెడ్డి చావు తెలివితేటలకు నిదర్శనమని ఎద్దేవా చేశా రు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను, ప్రజలకు పడ్డ బకాయిలను బాకీ కార్డు ఉద్యమంతో గుర్తుచేస్తామని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్పేట, సమత కాలనీలో ఆదివారం ఉదయం ఎంఎల్సి దాసోజు శ్రవణ్, బిఆర్ఎస్ మైనారిటీ నేతలతో కలిసి కెటిఆర్ విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికీ తిరుగుతూ ‘కాంగ్రెస్ బకాయి కార్డు’లను ప్రజలకు అందించి, కాంగ్రెస్ మోసపూరిత పాలనను వివరించారు. దారుణంగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో చెంపపెట్టు లాంటి సమాధానం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇంటింటికి బాకీ కార్డులు పంచిన కెటిఆర్ ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎదుర్కొంటున్న సమస్యలను స్థానికులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం మీడియాతో కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ, అరచేతిలో స్వర్గం చూపించి ఓట్లు దండుకున్న కాంగ్రెస్, 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి 700 రోజులైనా ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, ప్రజలను దారుణంగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పే అద్భుత అవకాశం జూబ్లీహిల్స్ ప్రజలకు వచ్చిందని కెటిఆర్ అన్నారు. ఇప్పుడు బుద్ధి చెప్పకపోతే మరో మూడేళ్లపాటు వారి అరాచకాలకు అడ్డే ఉండదని హెచ్చరించారు.
బిఆర్ఎస్ అభ్యర్థి సునీతను గెలిపించాలని కోరారు. తెలంగాణలో అసలు అభివృద్ధే జరగడం లేదని మహబూబ్నగర్ ఎంఎల్ఎ యెన్నం శ్రీనివాసరెడ్డి వ్యాసం రాస్తే, తన నియోజకవర్గానికి ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు అని, వంద కోట్లు ఇచ్చి ఆదుకోవాలని ఎల్లారెడ్డి ఎంఎల్ఎ మదన్మోహన్ ప్రపంచ బ్యాంకుకే లేఖ రాశారని చెప్పారు. కాంగ్రెస్ పాలన ఎలా ఉందో చెప్పడానికి ఈ రెండు ఉదాహరణలుచాలని అన్నారు.