దుబాయ్: ఆసియాకప్-2025లో ఆఖరి పోరుకు రంగం సిద్ధమైంది. 41 ఏళ్ల తర్వాత భారత్, పాకిస్థాన్ జట్లు ఆసియాకప్ ఫైనల్స్లో తలపడుతున్నాయి. ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే గ్రూప్ దశలో ఒకసారి, సూపర్ ఫోర్లో ఒకసారి భారత్, పాకిస్థాన్ను ఓడించింది. ఈ మ్యాచ్లోనూ పాక్ను ముచ్చటగా ఓడించి ట్రోఫీని అందుకోవాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఈ మ్యాచ్లో భారత్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. హార్థిక్ పాండ్యా తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అతని స్థానంలో రింకూ సింగ్ జట్టులోకి వచ్చాడు. బుమ్రా, దుబేలు తుది జట్టులోకి వచ్చారు. ఇక పాకిస్థాన్ జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది.
తుది జట్లు:
భారత్: అభిషేక్ శర్మ, శుభ్మాన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, సంజూ శాంసన్(కీపర్), శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
పాకిస్థాన్: సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా(కెప్టెన్), హుస్సేన్ తలత్, మహ్మద్ హారీస్(కీపర్), మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, హారీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్